జూన్ 26న డీవీ కృష్ణ వర్ధంతి సభకు సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ పిలుపు.

జూన్ 26న డీవీ కృష్ణ వర్ధంతి సభకు సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ పిలుపు.

బోధన్ ప్రతినిధి రాహుల్‌ :- ఆదర్శ కమ్యూనిస్టు విప్లవకారుడు, కార్మిక వర్గ పోరాట యోధుడు కామ్రేడ్ డీవీ కృష్ణ 4వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ పిలుపునిచ్చారు.

 

 

బోధన్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 26న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం సమీపంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో డీవీ కృష్ణ 4వ వర్ధంతి సందర్భంగా స్మారక ఉపన్యాసాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా “ఆర్థిక సంక్షోభం – ప్రజలకు సవాళ్లు” అనే అంశంపై ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, “దేశంలో పెరుగుతున్న ఫాసిజం” అంశంపై సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు, “డీవీకే సిద్ధాంత, రాజకీయ కృషి” అంశంపై రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు కామ్రేడ్ కేజీ రామచందర్ ఉపన్యసిస్తారని తెలిపారు.

 

 

అదేవిధంగా రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు కామ్రేడ్ వి. ప్రభాకర్ ప్రసంగించనున్నారని, ఈ సభకు కామ్రేడ్ వనమాల కృష్ణ అధ్యక్షత వహిస్తారని చెప్పారు. పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల నాయకులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని మల్లేష్ కోరారు.

 

 

ఈ సమావేశంలో పడాల శంకర్, బి. శంకర్, బి. సాయిలు, జి. దేవయ్య, గంగారాం, డి. పోశెట్టి, హైమద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.