హైదరాబాద్లో మొక్కలు అందజేసి పర్యావరణ సందేశం.
హైదరాబాద్ ప్రతినిధి గౌరవ్ బీడ్కర్: పురోగామి పాత్రికేయ సంఘ్ (భారత్) జాతీయ అధ్యక్షుడు విజయ్ సూర్యవంశీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన ఇచ్చిన “ఒక పదాధికారి – ఒక మొక్క” అనే పర్యావరణ పరిరక్షణ పిలుపుకు స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో వృక్షారోపణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గజానన్ బిడ్కర్, రాష్ట్ర కార్యదర్శి గౌరవ్ బిడ్కర్ హైదరాబాద్ అంబర్పేట్ సెంట్రల్ పోలీస్ లైన్స్ పరిధిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు నాగచంపా, చేమంతి పూల మొక్కలను అందజేశారు. పాఠశాల ప్రతినిధి అంజనేయులు గౌడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయ్ సూర్యవంశీ జన్మదినాన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించాలని చేసిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర పదాధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలోని పురోగామి పాత్రికేయ సంఘ్ (భారత్) పదాధికారులు, సభ్యులు, జర్నలిస్టులు విజయ్ సూర్యవంశీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు, మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గజానన్ బిడ్కర్ మాట్లాడుతూ సంఘం బలోపేతానికి ప్రతి పదాధికారి, సభ్యుడు మరింత చురుకుగా పనిచేయాలని, గ్రామస్థాయి వరకు సంఘాన్ని విస్తరించాలని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
